Wednesday, February 17, 2010

విత్తుట - కోయుట 1








ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా ఇష్టపడిన విషయం, అనుభవపూర్వకంగా నేర్చుకుని ఆచరించిన విషయం ఇది.

రైతు ఏదైనా పంటను ఆశించినపుడు ముందుగా దానికి సంబధిచిన ప్రణాలికను తయారు చేసుకుంటాడు. ఆ ప్రణాళికను తన మనో నేత్రంతో దర్శించి, ఆపై నమ్మకంతో ఆ పంటను విత్తడానికి పూనుకుంటాడు.

అతనికి ఖచ్చితమైన, నిర్ధిష్టమైన కొన్ని అభిప్రాయాలు, ఆలోచనలు అప్పటికే ఏర్పడి ఉంటాయి. తన నమ్మకం నిజమవుతుంది లేదా నిజమే అనడానికి కావలసిన ఆధారాలను సంపాదించుకుని, అడిగిన వారికి లేదా తన పనికి సరి అయిన సమాధానాన్ని సిద్దపరచుకుని ఉంటాడు.

ముందుగా విత్తనాన్ని సపాదించి శుద్ధి చేసుకుని, పొలం / నేల ను దున్ని పదును చేసి, తగినంత నీరు పెట్టి పంట విత్తడాని తయారు చేసుకుంటాడు. ఎంత పంటను ఆశిస్తున్నాడో దానికి తగినంత విత్తనాన్ని విత్తుతాడు.

అక్కడితో అతని భాధ్యత తీరిపోలేదు. తన పంట ఫలించి చేతికి వచ్చేవరకు నమ్మకంతో దానికి తగిన పోషణ చేస్తూనే ఉంటాడు. ఒకవేళ మధ్యలో ప్రతికూల పరిస్థితులు వస్తే ఎదుర్కోవడానికి మార్గాలను, అవసరమయిన సరంజామాను ముందే సిద్దం చేసుకుంటాడు.

అలాగే ఆత్మీయంగా మనం ఏదైనా ఫలాన్ని ఆశిస్తే, మన హృదయాన్ని ముందుగానే సిద్దం చేసుకోవాలి. మనం ఏమి ఆశిస్తున్నామో సరి అయిన అవగాహన కలిగి ఉండాలి. ఆశిస్తున్న ఫలానికి సంబందిచిన విషయాలను అంటే ఇంతకు ముందు జరిగిన విషయాలను, జరుగుతాయి అన్న సూచనలను గమనించుకోవాలి. వాటిని (ఆ వాక్య భాగాలను) సేకరించుకోవాలి.

ఇక ఇప్పుడు మన ప్రణాలికను సిద్దం చేసుకుని, విత్తనన్ని విత్తాలి. అదే విశ్వాసమనే ఆయుధంతో మన హౄదయాన్ని పదును చేసి, అదృశ్యమైనవి మనో నేత్రం ముందు ఆవిష్కరించి, వాక్యమనే ఆధారంతో విత్తాలి.

ప్రతి రోజు ఆ మనో దౄశ్యాన్ని మరింతగా అభివృద్ధి పరచుకుంటూ, ప్రవచనాలను, వాక్యభాగాలను ఆధారం చేసుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. అపోస్తలులు చెప్పినట్లు అదృశ్యమైనవి చూడగలగడమే, అసాధ్యమైనవి సాధించడంలోని అసలు రహస్యం. నిరీక్షణను ఏమాత్రం కోల్పోకుండా కాపాడుకోవడమే జయించడానికి మూలకారణం.

దేవుని సన్నిధిలో మనం ఒక విషయాన్ని గురించి ప్రార్దిస్తున్నప్పుడు, ఆవిషనికి సంబంధిన విషయాలు ఇంతకు క్రితం జరిగినవి, జరగనున్నవి అని చెప్పే వాక్య భాగాలను నిత్యం ధ్యానిస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితిలోను అపనమ్మకాన్ని దరి చేరనీయకూడదు.

పర్వతారోహకుడికి ముందు చేరవలసిన గమ్యమే తప్ప, ఎక్కి వచ్చిన ఎత్తు గుర్తుకు రాకూడదు. ఒక వేళ అంత ఎత్తునుండి క్రిందకు చూస్తే కళ్ళు తిరిగి, గుండే బలహీన పడి గమ్యం చేరలేక పోవచ్చు. కాబట్టి మనకు కూడా సాధించాల్సిన లక్ష్యమే గుర్తుండాలి కాని, అది సాధ్య పడదేమొ అన్న ఆలోచన ఎప్పుడు దరి చేరకూడదు.

పరిశుద్ధ గ్రంధంలోని మాటలు, ప్రవక్తల మాటలు మనలను ప్రోత్సాహ పరచే మాటలే మన ధ్యానంలో నిత్యం ధ్యానిస్తూ ఉండాలి.

కానుకలు ఇచ్చేటప్పుడు, మనం ఎందుకు ఇస్తున్నామో, ఏమి ఆశించి ఇస్తున్నామో స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎందుకంటే మనం ఇది ధేవుని దగ్గర చేస్తున్న ఇన్వెస్ట్ మెంట్. చేసే ఇన్వెస్ట్ మెంట్ గురించిన అవగాహన లేకపోతే వచ్చిన ప్రతిఫలం ఖచ్చితమైనదే అని గ్రహించడం? ఎంత విత్తుతున్నామో, ఎలా విత్తుతున్నామో తెలియకపోతే, ఎంత పంటను కోసుకోవాలో, ఎంత ఆశిస్తున్నామో ఎలా తెలిసేది?

అందుకే దేవుడు ఇలా చెప్తున్నాడు "వెలుగులో నడిచేవాదికి మరెవ్వరూ దీపం తో దారి చూపనవసరం లేదు". దానర్ధం జ్ఞానంతో, తెలివితో, తను చేస్తున్న పనిపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తికి మరెవరి విశ్లేషణ అవసరం లేదు.

విట్టుటలోని పద్దతులు, ఫలితాలు వంటి మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.

No comments:

Post a Comment